సింహాన్ని చూపెట్టి భయపెడుతున్న రాజ‌మౌళి.. SSMB29..!

సింహాన్ని చూపెట్టి భయపెడుతున్న రాజ‌మౌళి.. SSMB29..!

టాలీవుడ్ నుండి వ‌స్తున్న సినిమా SSMB29. తాజాగా ఈ ప్రాజెక్ట్ నుండి అప్‌డేట్ ఇచ్చారు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. SSMB29 అంటూ వ‌స్తున్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుందా అని అటు బాబు ఫ్యాన్స్‌తో పాటు సినిమా ల‌వ‌ర్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టికే పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శరవేగంగా జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో సినిమా నుండి సాలిడ్ అప్‌డేట్‌ను షేర్ చేశారు రాజ‌మౌళి. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన‌ట్లు చెబుతూ.. ఒక వీడియోను విడుద‌ల చేశారు రాజ‌మౌళి. ఈ వీడియోలో సింహాన్ని (మ‌హేష్‌బాబుని) ఎటూ వెళ్ల‌కుండా బోన్‌లో పెట్టి లాక్ చేసిన‌ట్లు పాస్‌పోర్ట్ చూపిస్తున్న‌ వీడియో విడుద‌ల చేశారు. దీనికి ‘క్యాప్చర్‌’ అనే క్యాప్షన్‌ పెట్టారు. అయితే ఈ వీడియోతో తాజాగా ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా ఫిక్స్ అయిన‌ట్లు త‌న పోస్ట్‌తో ఖ‌రారు చేసింది. మ‌రోవైపు ఈ వీడియోపై మ‌హేష్‌బాబు, ప్రియాంక చోప్రా స్పందించారు. మ‌హేష్‌బాబు స్పందిస్తూ.. ఒక్కసారి కమిట్‌ అయితే నా మాట నేనే వినను పోకిరిలోని డైలాగ్‌ను రిపీట్ చేశారు. ప్రియాంక‌చోప్రా స్పందిస్తూ.. ఫైనల్లీ అంటూ రాసుకొచ్చింది. అడ్వెంచ‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌స్తున్న ఈ సినిమా అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే కథగా అనిపిస్తోంది.

editor

Related Articles