టీవీ నటుడు నితిన్ చౌహాన్ ఇక లేరు..

టీవీ నటుడు నితిన్ చౌహాన్ ఇక లేరు..

టీవీ నటుడు నితిన్ చౌహాన్ 35 ఏళ్ళ వయసులో మరణించారు. సహనటులు సుదీప్ సాహిర్, విభూతి ఠాకూర్ పోస్ట్ నివాళులు అర్పించారు. అతను చివరిగా తేరా యార్ హూన్ మైన్ అనే టీవీ షోలో కనిపించాడు. రియాల్టీ షో దాదాగిరి 2 విజేతగా ప్రసిద్ధి చెందిన టెలివిజన్ నటుడు నితిన్ చౌహాన్ గురువారం ముంబైలో మరణించారు. అతని వయసు 35. అతని తేరా యార్ హూన్ మెయిన్ సహనటులు సుదీప్ సాహిర్, సయంతని ఘోష్ అతని మరణ వార్తను కన్‌ఫర్మ్ చేశారు, అయితే ఒక ఇంగ్లీష్ పత్రికలో వచ్చిన నివేదిక ప్రకారం, తమకు అదనపు సమాచారం లేదని పేర్కొన్నారు. నితిన్ తండ్రి తన కుమారుడి మృతదేహాన్ని హేండోవర్ చేసుకునేందుకు ముంబైకి వెళ్లినట్లు సమాచారం.

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో జన్మించిన నితిన్ రియాలిటీ షో దాదాగిరి 2 విజేత తర్వాత కీర్తిని, పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకున్నారు, తరువాత అనేక ప్రముఖ టెలివిజన్ షోలలో కనిపించాడు. అతని క్రెడిట్‌లలో MTV స్ప్లిట్స్‌విల్లా 5, అలాగే జిందగీ డాట్ కామ్, క్రైమ్ పెట్రోల్, ఫ్రెండ్స్ వంటి సిరీస్‌లలో ఎపిసోడిక్ పాత్రలు చేశారు. నటుడుగా లాస్ట్ టైమ్ టీవీ షో తేరా యార్ హూన్ మైన్ (2022)లో కనిపించారు.

administrator

Related Articles