మలయాళ సినిమా నుండి రిలీజ్కి రాబోతున్న లేటెస్ట్ సినిమా లూసిఫెర్ సీక్వెల్ ఎంపురాన్ కోసం అందరికీ తెలిసిందే. మోహన్లాల్ హీరోగా నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ తెరకెక్కించిన లూసిఫెర్కి సీక్వెల్గా గ్రాండ్ ఎలిమెంట్స్తో మేకర్స్ ఈ సినిమాని ప్లాన్ చేసుకున్నారు. మరి ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా ట్రైలర్పై ఇపుడు మేకర్స్ సాలిడ్ అప్డేట్ అందించారు. టీజర్తో మంచి ఆసక్తి రేపిన ఈ సినిమా ఇప్పుడు ట్రైలర్తో అలరించేందుకు ఈ మార్చ్ 20 మధ్యాహ్నం 1 గంట 8 నిమిషాలకి వచ్చేందుకు సిద్ధం అయ్యింది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం నిర్మాతలు ప్రతీ పనిని పక్కా ప్లాన్తో తీసుకెళ్తున్నారు. ఇక రేపు వచ్చే ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ సినిమాకి దీపక్ దేవ్ సంగీతం అందిస్తుండగా మార్చ్ 27న గ్రాండ్గా ఈ చిత్రం రాబోతోంది.

- March 19, 2025
0
13
Less than a minute
Tags:
You can share this post!
editor