భారత అతిపెద్ద మల్టీప్లెక్స్ నిర్వహణ సంస్థ పీవీఆర్ సినిమాస్ క్రికెట్ లవర్స్కి గుడ్ న్యూస్ తెలిపింది. మూవీ లవర్స్కి అదిరిపోయే ఆఫర్లు ప్రకటిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఐపీఎల్ ప్రారంభమవుతుండడంతో క్రికెట్ను ఇష్టపడే ప్రేక్షకుల కోసం మరో ఆఫర్తో మన ముందుకు వచ్చింది. నేటి నుండి ఐపీఎల్ ప్రారంభం కానుండటంతో ఈ వేడుకలతో పాటు లైవ్ మ్యాచ్లను పీవీఆర్లో వీక్షించవచ్చని తెలిపింది. దీనికోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. దేశంలోనే 30 నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉండగా.. వీకెండ్ మ్యాచ్లతో పాటు ప్లేఆఫ్లను మ్యాచ్లను థియేటర్లలో పదర్శించనున్నట్లు వెల్లడించింది. ఈ విషయంపై పీవీఆర్ ఐనాక్స్ రెవెన్యూ, ఆపరేషన్స్ సీఈఓ గౌతమ్ దత్తా మాట్లాడుతూ.. అత్యుత్తమ విజువల్స్, సౌండ్, సిటింగ్ వ్యవస్థతో మ్యాచ్ను స్టేడియంలో చూసినట్లే అనుభూతిని అందిస్తామని తెలిపారు. సినిమాను క్రికెట్ను ఒక వేదికపై తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉందని గత సంవత్సరం క్రికెట్ మ్యాచ్ల ప్రసారానికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చిందని, అందువల్ల ఈ ఏడాది కూడా ప్రీమియం క్వాలిటీ అనుభవాన్ని అందించేందుకు ప్రసారం చేయాలని నిర్ణయించామని వివరించారు. ఇండియాలోని ప్రధాన మెట్రో నగరాలతో పాటు టైర్-2, టైర్-3 నగరాల్లోనూ ఈ స్క్రీనింగ్లు జరగనున్నట్లు పీవీఆర్ ఐనాక్స్ తెలిపింది. మరిన్ని వివరాల కోసం పీవీఆర్ వెబ్సైట్ను విజిట్ చేయండంటూ సీఈఓ గౌతమ్ దత్తా వెల్లడించాడు.

- March 22, 2025
0
49
Less than a minute
Tags:
You can share this post!
editor