తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ‘తండేల్’ చిత్రబృందం దర్శించుకుంది. గురువారం ఉదయం స్టార్ నటులు నాగచైతన్య, సాయిపల్లవి, దర్శకుడు చందూ మొండేటి, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు తదితరులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఉదయం గుడికి చేరుకున్న వీరికి తితిదే అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ‘తండేల్’ సినిమా విజయం సందర్భంగా తామంతా తిరుమలకు వచ్చినట్లు చందూ మొండేటి తెలిపారు.
- February 13, 2025
0
225
Less than a minute
Tags:
You can share this post!
administrator

