మోహన్‌బాబుకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసిన సుప్రీం..!

మోహన్‌బాబుకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసిన సుప్రీం..!

సినీ నటుడు మోహన్‌ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జర్నలిస్ట్‌పై దాడి కేసులో ప్రముఖ సినీ నటుడు మోహన్‌ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో మోహ‌న్‌బాబుకి సుప్రీంకోర్టు గురువారం ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. జల్‌పల్లిలోని మోహ‌న్‌బాబు నివాసం వద్ద మీడియా ప్రతినిధిపై దాడి చేయడంపై పహాడీషరీఫ్‌ పోలీసులు మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో మొదట ఆయనపై బీఎన్‌ఎస్‌ 118(1) సెక్షన్‌ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. లీగల్‌ ఒపీనియన్‌ తీసుకున్న తర్వాత 109 సెక్షన్‌ కింద కేసు రిజిస్టర్‌ చేసి.. హత్యాయత్నం కేసుగా మార్చారు. ఈ దాడి ఘటనలో గాయపడ్డ జర్నలిస్ట్‌కు మోహన్‌ బాబు క్షమాపణలు చెప్పారు.

editor

Related Articles