2006లో విడుదలైన ‘పొగరు’ సినిమాలో నెగటివ్ పాత్రలో నటించి తెలుగు వారికి చేరువయ్యారు నటి శ్రియా రెడ్డి. గతేడాది సలార్తో మనల్ని అలరించారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తూన్న చిత్రం ‘ఓజి’ లో నటిస్తున్నారు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ, “ ఓజీలో నా పాత్ర చాలా ప్రత్యేకం. సలార్లోని పాత్రకు విభిన్నంగా ఉంటుంది. స్క్రీన్పై నన్ను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు” అని తెలిపారు.
అనంతరం పవన్ కల్యాణ్తో ఇప్పటికే కొన్ని సన్నివేశాల్లో నటించిన ఆమె, “ ఆయన ఎంతో హుందాగా ఉంటారు. ఆయన ప్రవర్తన, మాట్లాడే విధానం చూడచక్కగా ఉంటాయి. ఆయన చాలా తెవివైన, మర్యాద గల వ్యక్తి” అని తెలిపారు. సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా, ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ తదితరులు నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.