వరుణ్ తేజ్ హీరోగా పాన్ ఇండియా క్రైమ్ డ్రామా ‘మట్కా’ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో “కొరియన్ కనకరాజు” సినిమాతో మళ్లీ మన ముందుకు వస్తున్నాడు వరుణ్ తేజ్. రాయలసీమ మరియు కోరియా బ్యాక్డ్రాప్లో హారర్ థ్రిల్లర్గా ఈ సినిమా తెరకెక్కించనున్నారు. హాయ్ నాన్న ఫేమ్ రితిక నాయక్ ఇందులో హీరోయిన్ . యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థల సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం రానుంది. 2025 మార్చిలో చిత్రీకరణ ప్రారంభం కానుంది అని చిత్ర యూనిట్ తెలిపారు.
- December 20, 2024
0
343
Less than a minute
You can share this post!
administrator

