తమిళ హీరో సూర్య నటించిన రెట్రో సినిమా తాజాగా రూ.100 కోట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా, శ్రియ ప్రత్యేక గీతంలో కనిపించారు. 65 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమాను సూర్య, జ్యోతిక నిర్మించారు. మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ షో నుండే మిశ్రమ స్పందనలను అందుకున్న విషయం తెలిసిందే. తెలుగులో ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా తమిళంలో మాత్రం మంచి టాక్ను తెచ్చుకుంది. ఇటీవల ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్లో చేరినట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే ‘రెట్రో’ సాధించిన విజయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సూర్య.. ఈ సినిమా లాభాల నుండి రూ. 10 కోట్లను విరాళంగా ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆయన తన అగరం ఫౌండేషన్ ద్వారా నిరుపేద విద్యార్థుల విద్య కోసం అందజేశారు.
- May 8, 2025
0
70
Less than a minute
Tags:
You can share this post!
editor

