గచ్చిబౌలి భూముల వివాదం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) పరిధిలోని 400 ఎకరాల భూముల్లో పర్యావరణ విధ్వంసానికి తెగబడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గచ్చిబౌలి భూములను పరిరక్షించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కూడా దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం అగ్గి రాజేస్తున్న నేపథ్యంలో.. పలువురు రాజకీయ ప్రముఖులు, సినిమా ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ఈ విధ్వంసాన్ని ఆపాలంటూ రేణూ దేశాయ్ సీఎం రేవంత్ రెడ్డిని వేడుకుంది. ఎందుకంటే మిగిలిన చోట్ల చాలా భూములు ఉన్నాయి అవన్నీ వదిలేసి ఈ భూములపై ఎందుకు మాట్లాడుతున్నారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం గురించి నాకు రెండు రోజుల ముందు తెలిసింది. ఈ విషయంపై అన్నీ తెలిసిన తర్వాత మాట్లాడదామని సమయం తీసుకున్నాను. రేవంత్ రెడ్డి గారు నేను ఒక తల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు 44 ఏళ్లు.. రేపో మాపో చనిపోతాను. కానీ నా పిల్లలు.. మనందరి పిల్లలు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. వారికి ఆక్సిజన్ కావాలి.. వాటర్ కావాలి. వారి భవిష్యత్ కోసం మీరు ఆలోచించండి.

- April 2, 2025
0
11
Less than a minute
Tags:
You can share this post!
editor