ఇద్దరు పిల్లల్ని అనాథాశ్రమం నుండి దత్తత తీసుకున్న శ్రీలీల

ఇద్దరు పిల్లల్ని అనాథాశ్రమం నుండి దత్తత తీసుకున్న శ్రీలీల

మనిషే కాదు.. శ్రీలీల మనసు కూడా బంగారమే. రెండేళ్ల క్రితం దివ్యాంగులైన ఇద్దరు పిల్లల్ని అనాథాశ్రమం నుంచి దత్తత తీసుకున్నదట శ్రీలీల. వారి భవిష్యత్తుకు అండగా నిలవడమే కాక, వారి ప్రతి విషయాన్నీ దగ్గరుండి మరీ చూసుకుంటోందట. గురు, శోభిత ఆ పిల్లల పేర్లు. స్టార్‌డమ్‌ కారణంగా శ్రీలీల వ్యక్తిగత విషయాలను తెలుసుకోడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఈ విషయం వెలుగు చూసింది. నితిన్‌కి జోడీగా ఆమె నటించిన ‘రాబిన్‌హుడ్‌’ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. అలాగే.. హీరో కార్తీక్‌ ఆర్యన్‌తో ఓ బాలీవుడ్‌ సినిమాలో నటించనున్నది శ్రీలీల. అనురాగ్‌ బసు దర్శకత్వంలో భూషణ్‌కుమార్‌ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్‌ సినిమా.. ‘ఆషికీ 3’ అని బాలీవుడ్‌లో కథనాలు వెలువడుతున్నాయి. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది.

editor

Related Articles