ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట..

ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట..

సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట ల‌భించింది. గ‌తవారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని సూళ్లూరుపేట పోలీసులు పోసానిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోసాని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ నేడు విచార‌ణ‌కు రాగా.. పరిశీలించిన కోర్టు, పోసానిపై త‌దుప‌రి చర్యలు చేపట్టవద్దని పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో సెక్షన్ 111తో పాటు, ఒక మహిళను అసభ్యంగా చిత్రీకరించారనే ఆరోపణలతో పోసానిపై అదనపు సెక్షన్లు చేర్చడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను పట్టించుకోకుండా వ్యవహరించారంటూ విచారణ అధికారి మురళీకృష్ణపై సీరియస్ అయింది. ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయని నిలదీసింది. మురళీకృష్ణకు ఫామ్ 1 నోటీసు జారీ చేసి, రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.

editor

Related Articles