‘కింగ్‌డ‌మ్’తో ఓపెన్ అయిన ర‌వితేజ మ‌ల్టీప్లెక్స్‌..

‘కింగ్‌డ‌మ్’తో ఓపెన్ అయిన ర‌వితేజ మ‌ల్టీప్లెక్స్‌..

టాలీవుడ్ మాస్ మ‌హారాజా రవితేజ మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్‌లోకి అడుగు పెట్టాడు. హీరోలు మహేష్‌బాబు, విజయ్‌ దేవరకొండ, అల్లు అర్జున్‌ల బాట‌లోనే ర‌వితేజ కూడా మల్టీప్లెక్స్‌ బిజినెస్‌లోకి అడుగు పెట్ట‌బోతున్న‌ట్లు గ‌తంలో ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ మాస్ హీరో ఏషియన్ సంస్థతో కలిసి ART సినిమాస్ అనే మల్టీప్లెక్స్‌ను ప్రారంభించాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ నటించిన కింగ్‌డ‌మ్ సినిమాతో ఈ మ‌ల్టీప్లెక్స్‌ను ప్రారంభించ‌గా.. హైదరాబాద్‌లోని వ‌న‌స్థ‌లిపురంలోని ప్ర‌జ‌ల‌కు నేటి నుండి ఈ మ‌ల్టీప్లెక్స్ అందుబాటులోకి వచ్చింది. 6 స్క్రీన్ల‌తో ఈ మ‌ల్టీప్లెక్స్ ప్రారంభించిన‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక వీడియోను కూడా విడుద‌ల చేశారు ర‌వితేజ‌.

editor

Related Articles