టీజర్‌తో ఆకట్టుకుంటున్న రష్మిక మందన్నా ‘ద గర్ల్ ఫ్రెండ్’

టీజర్‌తో ఆకట్టుకుంటున్న రష్మిక మందన్నా ‘ద గర్ల్ ఫ్రెండ్’

రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘ద గర్ల్ ఫ్రెండ్’. ప్రముఖ నటుడు-దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తీస్తున్న ఈ సినిమా నుండి తాజాగా టీజర్ రిలీజ్ అయింది. ఎమోషనల్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమా టీజర్ చాలాబాగా ఆకట్టుకుంది. పైగా విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్ సాగడం విశేషం. ‘నీకని మనసుని రాసిచ్చేసా.. పడ్డానేమో ప్రేమలో బహుశా’ అని విజయ్ దేవరకొండ చెబుతుంటే.. స్క్రీన్‌పై రష్మిక విజువల్స్ చాలాబాగున్నాయి. మొత్తానికి టీజర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది. యానిమ‌ల్, పుష్ప 2 ది రూల్ సినిమాల‌తో వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్‌లు అందుకుంది నేషనల్​ క్రష్​ రష్మిక మందన్నా. ముఖ్యంగా టీజర్ మొత్తం రష్మిక క్లోజప్ షాట్స్ కనిపించాయి. మొత్తానికి ఈ మూవీలో రష్మిక యాక్టింగ్ అదరగొట్టేయబోతుందనిపిస్తోంది. కాగా ‘ద గర్ల్ ఫ్రెండ్’ సినిమాని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక హేసమ్ అబ్దుల్ సంగీతమందించగా.. ‘దసరా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి.. రష్మికకు జోడీగా కనిపించబోతున్నాడు. బహుశా ఫిబ్రవరిలో ఈ సినిమా రిలీజ్ ఉండొచ్చు అని టాక్ వినిపిస్తోంది.

editor

Related Articles