నందమూరి బాలకృష్ణ గారి 109 సినిమా ‘డాకూ మహరాజ్’ జనవరి 12, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధాశ్రీనాథ్ నాయికలుగా నటిస్తున్నారు.చాందినీ చౌదరి, ఊర్వశీ రౌతేలా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ను అమెరికాలోని టెక్సాస్లో ట్రస్ట్ క్యూ థియేటర్లో జనవరి 4వ తేది సాయంత్రం 6గంటల నుండి ప్రారంభించనున్నట్లు చిత్ర యూనిట్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ ఈవెంట్కు సంబంధించిన టికెట్ల బుకింగ్ కూడా ప్రారంభమైందని సమాచారం.
ఇక థమన్ అఖండలో పూనకాలతో ఊగిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చి అదరగొట్టిన విషయం తెలిసిందే. థియేటర్స్లో మరోసారి ఈ చిత్రానికి అలాగే సౌండ్ బాక్స్లను బద్దలు కొట్టబోతున్నాడని టీజర్ చూస్తుంటేనే తెలిసిపోతుంది. సంక్రాంతి బరిలో వచ్చే ఈ సినిమాతో, బాలయ్య మరో హిట్ అందుకుంటారని టీజర్ చూసిన ఆభిమానుల అంచనా.