హారర్ ఎంటర్టైనర్గా మారుతి దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘రాజాసాబ్’. డార్లింగ్ ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహన్ హీరో హీరోయిన్లగా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిసున్నారు.
అయితే ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతం కోసం నయనతారను సంప్రదించగా, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. వచ్చే నెలలో పాటను చిత్రీకరించే అవకాశముంది.
వీరిద్దరు 2007లో యోగీ సినిమాలో జంటగా నటించారు. వచ్చే సంవత్సరం ఏప్రల్ 10న రిలీజ్ కానున్న ఈ చిత్రంలో మళ్లీ 17 ఏళ్ల తర్వాత కలిసి వీరు కనిపించనున్నారు. ఇందులో ఫస్ట్ సాంగ్ సంక్రాంతికి విడుదల కానుంది.