లోకేష్ కనగరాజ్, రజనీకాంత్ కాంబోలో వస్తున్న కూలీ సినిమాలో పూజా హెగ్డే నటిస్తున్నట్లు తెలిసింది. తమిళ హీరో రజనీకాంత్ తన అప్కమింగ్ సినిమాలతో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే జైలర్ 2 అనౌన్స్మెంట్ ఇచ్చిన రజనీ మరోవైపు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా.. నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహీర్, శృతిహాసన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ దర్శకుల్లో ఒకరైన లోకేష్ కనగరాజ్తో రజనీకాంత్ జోడీ కడుతుండడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గోల్డ్ స్మగ్లింగ్కు సంబంధించిన కథాంశంగా ఈ సినిమా రూపొందుతుండగా ఇప్పటికే విడుదలైన ప్రోమో, సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలోని ఫస్ట్ లుక్ని చిత్రబృందం విడుదల చేసింది. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

- February 27, 2025
0
16
Less than a minute
Tags:
You can share this post!
editor