బాలీవుడ్ క్యూట్ బ్యూటీ అయేషా శర్మ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఎప్పుడూ గ్లామరస్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకునే ఈ అందాల భామ, తాజాగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా స్టైలిష్ లుక్స్తో పాటు గ్లామర్ డోస్ పెంచి నెటిజన్లను ఫిదా చేసింది. చిరుత సినిమా హీరోయిన్ నేహా శర్మ చెల్లెలైన అయేషా, ముందుగా మోడల్గా కెరీర్ ప్రారంభించింది. తరువాత నటిగా మారి సత్యమేవ జయతే చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే లాక్మే, పెప్సీ, క్యాంపస్ షూస్ వంటి ప్రముఖ బ్రాండ్ల ప్రకటనల్లో కనిపించి మరింత పాపులారిటీ సంపాదించింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే అయేషా, తరచూ తన పర్సనల్ మరియు ప్రొఫెషనల్ అప్డేట్స్ అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా షేర్ చేసిన ఫొటోలకు అభిమానులు “అందంగా ఉన్నావు”, “అదిరిపోయావు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
- April 29, 2026
0
27
Less than a minute
You can share this post!
editor

