యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ దూరదర్శిని మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. సువిక్షిత్, గీతికా రతన్ జంటగా నటించిన ఈ చిత్రానికి కార్తికేయ కొమ్మి దర్శకత్వం వహించారు. వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయ శంకర్ రెడ్డి, పాటిమీది సంతోష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హైదరాబాద్లో జరిగిన చిత్రలహరి మీట్లో దర్శకుడు మాట్లాడుతూ, ఇది కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాదని, తల్లిదండ్రులు, యూత్, సమాజానికి నచ్చే అంశాలు ఇందులో ఉన్నాయని తెలిపారు. ఈ సినిమా 90వ దశకం రోజులను, చిత్రలహరి కోసం ఎదురుచూసిన మధుర క్షణాలను గుర్తుకు తెస్తుందని అన్నారు. సినిమాలోని ఎమోషన్స్ ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటాయని, క్లైమాక్స్ ఆలోచింపజేస్తుందని చెప్పారు. సినిమా చూసిన తర్వాత ఆ ఫీలింగ్ వెంటాడుతుందని వెల్లడించారు. హీరో సువిక్షిత్కు మంచి గుర్తింపు తెచ్చే చిత్రంగా ఇది నిలుస్తుందని చిత్రబృందం నమ్మకం వ్యక్తం చేసింది.
- April 29, 2026
0
5
Less than a minute
You can share this post!
editor

