బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో పంజాగుట్ట పోలీసులు విచారణను వేగవంతం చేశారు. యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న టీవీ నటీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో సహా పలువురిపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు యాంకర్, బిగ్బాస్ ఫేమ్ విష్ణుప్రియ, యూట్యూబర్, కమెడియన్ టేస్టీ తేజకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో ఆదేశించారు. విచారణ తర్వాత మరికొందరికి సైతం విచారణకు రావాలని నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన ఇతర వ్యక్తులపై సైతం పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్స్, టీవీ నటీనటుల్లో పలువురిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. యాంకర్లు విష్ణుప్రియ, శ్యామల, హర్షసాయి, ఇమ్రాన్ ఖాన్, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, రీతూ చౌదరి, సుప్రీత, సుధీర్, అజయ్, సన్నీ యాదవ్ పలువురిపై పలు సెక్షన్లతో పాటు యాక్టుల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే సేకరించిన యాప్స్ లింక్స్ ఆధారంగా పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నట్లు సమాచారం.

- March 18, 2025
0
15
Less than a minute
Tags:
You can share this post!
editor