బాలీవుడ్ దర్శకుడిగా రాజ్కుమార్ హిరానీకి చాలా మంచిపేరు ఉంది. ఐతే, బాలీవుడ్ హీరో సంజయ్ దత్ హీరోగా తెరకెక్కిన మున్నాభాయ్ MBBS, లగే రహో మున్నాభాయ్ సినిమాలు అద్భుత విజయాలు సాధించాయి. ఇప్పుడు మూడో పార్ట్ కోసం కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఐతే, ఇప్పుడు తాజాగా ఈ సినిమాపై ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సౌత్ హీరో అక్కినేని నాగార్జున కూడా ఓ కీలక పాత్రలో నటిస్తారని తెలుస్తోంది. అయితే, నాగార్జున నటిస్తున్నాడనే వార్తపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సడెన్గా రాజ్కుమార్ హిరానీ మున్నాభాయ్-3ని ఎనౌన్స్ చేయడం, పైగా ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కూడా ఉంటాడని వార్తలు వస్తుండటం విశేషం. పైగా సంజయ్ దత్తో తాను చేసిన గత సినిమాల కంటే మెరుగ్గా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు రాజ్కుమార్ హిరానీ పేర్కొన్నారు. అన్నట్లు ఈ సినిమాలను తెలుగులో శంకర్దాదా MBBS, శంకర్దాదా జిందాబాద్ పేరుతో మెగాస్టార్ హీరోగా రీమేక్లో నటించిన సంగతి మీకు తెలుసు.
- February 10, 2025
0
66
Less than a minute
Tags:
You can share this post!
editor

