ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు (జూనియర్ ఎన్టీఆర్) వ్యక్తిత్వ మరియు ప్రచార హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తన పేరు, ఫోటోలు, రూపం, గుర్తింపును అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుతున్నారని ఎన్టీఆర్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం, ఆయన వ్యక్తిత్వ హక్కులు చట్టపరంగా రక్షణ పొందుతాయని స్పష్టం చేసింది. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, తారక్, యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ వంటి పేర్లు లేదా ఆయన ఇమేజ్ను అనుమతి లేకుండా వాడడం చట్టవిరుద్ధమని పేర్కొంది. అలాంటి కంటెంట్ కనిపిస్తే వెంటనే తొలగించాలని ఆదేశించింది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు కూడా 2021 ఐటీ నియమాల ప్రకారం ఫిర్యాదులను పరిగణించి లింకులను తొలగించాల్సిందిగా సూచించింది. ఒక సెలబ్రిటీ పేరు, గుర్తింపు ఆయన వ్యక్తిగత హక్కుల్లో భాగమని, ఇవి రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, 21 కింద రక్షితమని కోర్టు పేర్కొంది.
- January 29, 2026
0
121
Less than a minute
You can share this post!
editor

