ఫ్యామిలీ గొడవల నేపథ్యంలో నటుడు మంచు మోహన్ బాబు తన లైసెన్స్డ్ గన్ను పోలీసులకు సరెండర్ చేశారు. మోహన్ బాబు తన పర్సనల్ పీఆర్ఓ ద్వారా డబుల్ బ్యారెల్ గన్ను చంద్రగిరి పోలీసులకు అప్పగించిట్లు సమాచారం. గతకొన్ని రోజులుగా మంచు మోహన్ బాబు అతడి కుమారుడు మనోజ్లకు మధ్య వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు, మనోజ్ పోలీసులను ఆశ్రయించగా.. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా వారి తుపాకుల్ని పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయమని పోలీసులు ఆదేశించారు.
- December 16, 2024
0
288
Less than a minute
Tags:
You can share this post!
administrator

