మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న భక్తిరస ప్రధాన చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ డైరెక్షన్లో ఈ సినిమాని మంచు మోహన్బాబు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా బృందం ద్వాదశ జ్యోతిర్లింగాల టూర్లో భాగంగా కేథార్నాథ్, బద్రీనాథ్, రిషికేష్లను సందర్శించింది. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ ‘పరమ శివుడి భక్తుడి కథతో ‘కన్నప్ప’ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సినిమా రిలీజ్కు ముందే మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. విజువల్ వండర్గా ఆధ్యాత్మిక, భక్తి ప్రధాన అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అన్నారు. ఈ సినిమాలో మోహన్లాల్, అక్షయ్కుమార్, ప్రభాస్, శరత్కుమార్ వంటి అగ్ర తారలు కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుగుతోంది.

- October 26, 2024
0
46
Less than a minute
Tags:
You can share this post!
administrator