గత కొన్ని ఏళ్లుగా పలు యూట్యూబ్ ఛానల్స్ సెలబ్రిటీలను టార్గెట్ చేసి తప్పుడు థంబ్నెయిల్స్తో పాటు ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే టాలీవుడ్ నటి భార్గవి భర్తపై కూడా ఐడ్రీమ్ అనే యూట్యూబ్ ఛానల్ తప్పుడు థంబ్నెయిల్ పెట్టి ప్రేక్షకులను మిస్లీడ్ చేశారు. దీంతో ఈ విషయంపై భార్గవి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఐడ్రీమ్ నుండి సమాధానమే కాకుండా క్షమాపణలు కూడా చెప్పాలంటూ భార్గవి డిమాండ్ చేసింది. అయితే సెలబ్రిటీలపై తప్పుడు థంబ్నెయిల్స్ మితిమీరుతుండడంతో ఫిల్మ్ ఛాంబర్ సీరియస్ అయ్యింది. ఇదే విషయంపై సినీ పరిశ్రమలోని ఫిల్మ్, ఫొటో, క్రిటిక్, డిజిటల్ అసోసియేషన్లతో నేడు సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో తప్పుడు థంబ్నెయిల్స్ పెడుతున్న యూట్యూబ్ ఛానల్స్ను అరికట్టడంతో పాటు ఇటీవల జరిగిన పరిణామలపై చర్చించినట్లు తెలుస్తోంది. సినీ ప్రముఖులపై ఇంటర్వ్యూల పేరుతో అసభ్యకరమైన ప్రశ్నలు.. అనుచిత వ్యాఖ్యలతో కూడిన థంబ్నైల్స్ సృష్టించే వారిపట్ల ఫిల్మ్ ఛాంబర్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇకనుంచి తప్పుదోవ పట్టేలా థంబ్నెయిల్స్ పెడితే చర్యలు ఏప్రిల్ 1 నుంచి తీసుకోబోతున్నట్లు ప్రకటించింది.

- March 29, 2025
0
21
Less than a minute
Tags:
You can share this post!
editor