హీరో అమితాబ్ బచ్చన్ మరోసారి అయోధ్యలో భూమి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం వైరల్గా మారాయి. గతేడాది రామ మందిర నిర్మాణంతో అయోధ్యలో రియల్ ఎస్టేట్ బూమ్ ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బిగ్బీ అమితాబ్ బచ్చన్ రూ.14.5 కోట్లు పెట్టి అయోధ్యలో ఓ ప్లాట్ను 2024లో కొనుగోలు చేశాడు. ఇదిలావుంటే.. తాజాగా అమితాబ్ అయోధ్యలో మరోసారి భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్కి చెందిన హరివంశ్ రాయ్ బచ్చన్ మెమోరియల్ ట్రస్ట్ ఈ భూమిని కొనుగోలు చేసింది. ఈ భూమి రామ మందిరం నుండి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు సమాచారం. కొత్తగా కొన్న ల్యాండ్ దాదాపు 54,454 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్లు సమాచారం. దీని విలువ రూ.4.54 కోట్లు అని తెలుస్తోంది.

- March 12, 2025
0
38
Less than a minute
Tags:
You can share this post!
editor