నాంప‌ల్లి కోర్టులో అల్లు అర్జున్‌కి బెయిల్ మంజూరు..

నాంప‌ల్లి కోర్టులో అల్లు అర్జున్‌కి బెయిల్ మంజూరు..

సినీ హీరో అల్లు అర్జున్‌కి నాంప‌ల్లి కోర్టులో బెయిల్ మంజూరైంది. రెగ్యుల‌ర్ బెయిల్‌కి అప్ల‌య్ చేసిన అల్లు అర్జున్‌కి నాంపల్లి కోర్టు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరుకావాల‌ని ఆదేశించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ నిబంధనను కోర్టు మినహాయించింది. అలాగే విదేశాల‌కు వెళ్లేందుకు కూడా అల్లు అర్జున్‌కి కోర్టు అనుమ‌తినిచ్చింది. పుష్ప 2 సినిమా విడుద‌ల సంద‌ర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌లో రేవ‌తి అనే మ‌హిళ మృతి చెంద‌డంతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయాల‌తో ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘ‌ట‌న‌పై అల్లు అర్జున్‌ని చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. అరెస్ట్ చేసి నాంప‌ల్లి కోర్టు ముందు హాజ‌రుప‌ర్చ‌గా.. అత‌డికి 14 రోజుల జ్యుడిషియ‌ల్ రిమాండ్ విధించింది కోర్టు. దీంతో అత‌డిని చంచ‌ల్‌గూడ జైలుకు త‌ర‌లించ‌గా.. తెలంగాణ హైకోర్ట్ మ‌ధ్యంత‌ర బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో బెయిల్ మీద బ‌య‌టికి వచ్చాడు బ‌న్నీ. అయితే రీసెంట్‌గా బెయిల్ గ‌డువు కూడా ముగియ‌డంతో రెగ్యుల‌ర్ బెయిల్ కోసం అప్ల‌య్ చేసుకోగా.. నాంప‌ల్లి కోర్టు బ‌న్నీకి పలు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.

editor

Related Articles