ఇటీవల విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాడు హీరో విక్టరీ వెంకటేష్. దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన ఈ సినిమా పూర్తి కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను ఆకర్షించడంలో విజయవంతమైంది. ఈ సినిమా ద్వారా వెంకటేష్ తన కెరీర్లో అతిపెద్ద బ్లాక్బస్టర్ను తన ఖాతాలో వేసుకున్నాడు. దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాడు. అయితే ఈ సినిమా విజయంతో ఉత్సాహంగా ఉన్న ఈ హీరో, తన తదుపరి సినిమాని సిద్ధం చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెంకటేష్ వివిధ దర్శకుల నుండి కథలు వినడంలో బిజీగా ఉన్నాడని సమాచారం. ఈ సందర్భంలోనే ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఓ కథను వెంకటేష్కు వినిపించినట్లు తెలుస్తోంది. ఈ కథ వెంకీకి నచ్చడమే కాకుండా, నిర్మాత సురేష్ బాబు కూడా దీన్ని ఆమోదించినట్లు వార్తలు వస్తున్నాయి. సినీ వర్గాల్లో ఈ ప్రాజెక్ట్ను వెంకటేష్ ఖరారు చేసినట్లు చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా వెంకటేష్ కెరీర్లో 77వ సినిమాగా రానున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సినీ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది.

- March 28, 2025
0
14
Less than a minute
Tags:
You can share this post!
editor