బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా మరోసారి బీ టౌన్ వార్తల్లో నిలిచింది. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ షోలో పాల్గొనమని వచ్చిన రూ.1.65 కోట్ల ఆఫర్ ను తాను తిరస్కరించినట్లు తనుశ్రీ తెలిపింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ విషయం గురించి మాట్లాడింది. గత 11 ఏళ్లుగా ‘బిగ్ బాస్’ నిర్వాహకులు తనను షోలో పాల్గొనమని సంప్రదిస్తున్నారని తెలిపిన ఈ అమ్మాయి. ఈ సీజన్ కోసం ఏకంగా రూ. 1.65 కోట్లు ఆఫర్ ఇచ్చారని వెల్లడించింది. అయితే నాతో పాటు మరో స్టార్ నటికి కూడా ఇంతే మొత్తంలో ఆఫర్ ఇచ్చారు. ఆ నటి షోలో పాల్గొంది. కానీ నాకు మాత్రం షోకి వెళ్లడానికి ఆసక్తి లేదని తనుశ్రీ చెప్పుకొచ్చింది. అంతేగాకుండా.. ఈ షోలో పాల్గొనకపోవడానికి మరో ముఖ్యమైన కారణం ఉందని తెలిపింది. ఈ షో కోసం ఒక పరాయి మగాడితో బెడ్ పై పడుకోవడం నాకిష్టం ఉండదని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. హౌస్ లో ఆడ, మగ కలిసి ఒకే గదిలో ఒకే బెడ్ పై పడుకోవడం జరుగుతుందని అది తనకు ఇష్టం ఉండదని పేర్కొంది. నా వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో నా సొంత కుటుంబంతోనే నేను కలిసి ఉండను అలాంటిది పరాయి వ్యక్తులతో ఎలా ఒకే బెడ్ పై పడుకొంటాను అంటూ చెప్పుకొచ్చింది. కెరీర్ విషయానికి వస్తే.. కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాను అని చెప్పింది ఈ అమ్మాయి. బాలకృష్ణ సరసన నటించిన ‘వీరభద్ర’ ఆమె ఏకైక తెలుగు సినిమా.
