‘ఇష్క్ ఇన్ ది ఎయిర్’ సినిమాతో బాలీవుడ్లో మంచి గుర్తింపును సంపాదించుకుంది యువ హీరోయిన్ మేధా రానా. ప్రస్తుతం ఈమె భారీ ఆఫర్ను చేజిక్కించుకుంది. వరుణ్ధావన్ సరసన ‘బోర్డర్-2’ సినిమాలో హీరోయిన్గా నటించనుంది. ‘కేసరి’ ఫేమ్ అనురాగ్సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని టీ సిరీస్, జెపీ ఫిల్మ్స్ వంటి నిర్మాణ సంస్థలు తెరకెక్కిస్తున్నాయి. దేశభక్తి ప్రధానంగా యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో విడుదలకానుంది. ఈ సినిమా 1997లో వచ్చిన బ్లాక్బస్టర్ హిట్ ‘బోర్డర్’కు సీక్వెల్ కాదని, అదే రీతిలో సైనికుల అసమాన త్యాగాలు, దేశభక్తి ప్రధానంగా రూపొందిస్తున్నామని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో సన్నీ డియోల్ కీలక పాత్రలో నటించనున్నారు. త్వరలో సెట్స్మీదకు వెళ్లనుంది.

- July 29, 2025
0
40
Less than a minute
Tags:
You can share this post!
editor