టాలీవుడ్లో తెరకెక్కుతున్న ‘డకాయిట్’ సినిమా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. హీరో అడివి శేష్ నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు షేనియెల్ డియో డైరెక్ట్ చేస్తున్నాడు. పూర్తి యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్స్లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఒక యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తుండగా హీరో అడివి శేష్తో పాటు మృణాల్ ఠాకూర్కు గాయాలు అయ్యాయని తెలుస్తోంది. అయితే, వారు గాయాలతోనే షూటింగ్ ముగించినట్లు సినీ సర్కిల్స్ టాక్. ఈ సినిమా షూటింగ్ అనంతరం వారు గాయాలకు చికిత్స తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. క్రిస్మస్ కానుకగా డకాయిట్ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమౌతున్నారు.

- July 24, 2025
0
66
Less than a minute
Tags:
You can share this post!
editor