బాలీవుడ్లో తెరకెక్కుతున్న ఎపిక్ మైథలాజికల్ సినిమా రామాయణ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నితేష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతోంది. ఈ సినిమాలో రాముడిగా హీరో రణ్బీర్ కపూర్, సీతగా హీరోయిన్ సాయి పల్లవిలు నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా గురించి నార్త్తో పాటు సౌత్లోనూ సాలిడ్ హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ.1,600 కోట్లు ఉంటుందనే టాక్ ఇటీవల వినిపిస్తుండటంతో ఈ సినిమాలో నటిస్తున్న వారి రెమ్యూనరేషన్ ఏ స్థాయిలో ఉంటాయో అనే చర్చ కొనసాగుతోంది. కాగా, ఈ సినిమాలో రాముడిగా నటిస్తున్న రణ్బీర్ కపూర్కు ఏకంగా రూ.150 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. అయితే, ఇది రెండు భాగాలకు కలిపి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక సాయి పల్లవి ఈ సినిమా కోసం రూ.15 కోట్లు తీసుకుంటోందట. ఇలా లీడ్ రోల్స్లో నటిస్తున్న వీరిద్దరూ ఇంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోవడం బి టౌన్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక ఈ సినిమాలో మిగిలిన వారి రెమ్యూనరేషన్లు తెలియడం లేదు. రావణుడి పాత్రలో యష్ (యష్కు మాత్రం రూ.100 కోట్లు అని ఓ సమాచారం), లక్ష్మణుడిగా రవి దూబె, హనుమాన్గా సన్నీ డియోల్ నటిస్తున్నారు. 2026 దీపావళికి మొదటి భాగం.. 2027 దీపావళికి రెండో భాగాన్ని రిలీజ్ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి.
- July 9, 2025
0
88
Less than a minute
Tags:
You can share this post!
editor

