హీరోయిన్ సమంత ఇప్పుడు నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ‘ట్రాలాలా’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించిన సమంత తొలి సినిమాగా ‘శుభం’ అనే సినిమాని ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను కామెడీ జోనర్లో తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న ఈ సినిమాను వేసవి కానుకగా మే 9న రిలీజ్ చేసేందుకు సమంత ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా ట్రైలర్పై సామ్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చింది. ‘శుభం’ ట్రైలర్.. ఎప్పుడైనా రిలీజ్ కావచ్చు.. అంటూ సామ్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. దీంతో ఈ సినిమా ట్రైలర్ త్వరలోనే రిలీజ్ కాబోతున్నట్లు యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాకు వివేక్ సాగర్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.
- April 24, 2025
0
61
Less than a minute
Tags:
You can share this post!
editor

