ఇప్పటికిప్పుడు కాక‌పోయిన త్వ‌ర‌లోనే నీకు కుక్క చావు ఖాయం: మాధ‌వీ ల‌త

ఇప్పటికిప్పుడు కాక‌పోయిన త్వ‌ర‌లోనే నీకు కుక్క చావు ఖాయం: మాధ‌వీ ల‌త

టాలీవుడ్ హీరోయిన్ మాధ‌వీల‌త గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ హీరోయిన్ ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో కూడా ప‌లు సినిమాలు చేసింది. 2007లో మహేష్‌బాబు నటించిన “అతిథి” సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో తొలిసారిగా క‌నిపించిన మాధ‌వీల‌త 2008లో న‌చ్చావులే చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం నుండి బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మాధవీలత, సమాజంలో జరుగుతున్న తప్పొప్పులపై ఎప్పుడూ ఘాటుగా స్పందిస్తూ ఉంటుంది. తాజాగా ఈ హీరోయిన్ త‌న సోష‌ల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేస్తూ ఫైర్ అయింది. మాధ‌వీల‌త షేర్ చేసిన వీడియోలో ఓ వ్య‌క్తి శివాలయంలో ఉన్న బసవన్నకు నీళ్లతో అభిషేకం చేశాడు. ఆ త‌ర్వాత బసవన్నపై కాళ్లు క‌డుక్కోవ‌డం కనిపించింది. ఆ తర్వాత ఆ విగ్రహం మీద ఎక్కి కాళ్లు కడుక్కున్నాడు. అంతటితో ఆగకుండా దానిమీద ఉచ్చ కూడా పోశాడు. ఈ వీడియోపై మాధవీలత స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయింది. ‘అంటే అన్నానంటారు.. అదే అనకపోతే ఇలాంటివి చేస్తూనే ఉంటారు. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నారో’.. ఏం పర్లేదు ఏదో ఒకరోజు రోడ్డు మీద పోతుంటే ఎద్దు వచ్చి కడుపులో పొడుస్తుంది.. అంతే కర్మ అనుభవించక తప్పదు అంటూ మాధ‌వీల‌త పేర్కొంది. ఏం పర్లేదు ఇప్పుడు నవ్వినోడు, కడుక్కున్నోడు కచ్చితంగా కర్మ ఫలితం అనుభవిస్తారు, ఒకవేళ నీకు తెలియకపోతే నీ పిల్లలను కూడా తరతరాలుగా కర్మ ఫలితం వెంటాడుతూనే ఉంటుందంటూ  కాస్త ఘాటుగానే రియాక్ట్ అయింది.

editor

Related Articles