బాలకృష్ణ డాకు మహారాజ్‌కు టిక్కెట్లు గంటలోనే లక్షా 56 వేలకు పైగా…

బాలకృష్ణ డాకు మహారాజ్‌కు టిక్కెట్లు గంటలోనే లక్షా 56 వేలకు పైగా…

హీరో బాలకృష్ణ  కాంపౌండ్ నుండి వస్తోన్న సినిమా డాకు మహారాజ్‌. బాబీ  దర్శకత్వంలో ఎన్‌బీకే 109 గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ డ్యాన్సింగ్ క్వీన్‌ ఊర్వశి రౌటేలా ఫిమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. డాకు మహారాజ్‌ జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం. విడుదలకు ఇంకా రెండు రోజులే గేప్‌ ఉండటంతో టికెట్‌ బుకింగ్‌ అప్‌డేట్ వచ్చేసింది. డాకు మహారాజ్‌ టికెట్‌ బుకింగ్స్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక వ్యాప్తంగా థియేటర్లలో టికెట్‌ బుకింగ్స్ ఈ రోజే ప్రారంభమయ్యాయి. పరిమిత షోలతో బుకింగ్స్ మొదలైన గంటలోనే లక్షా 56 వేలకు పైగా టికెట్స్ సేల్‌ అయ్యాయి. బాలకృష్ణ సినిమాకు క్రేజ్‌ ఎలా ఉందో ఈ బుకింగ్స్ బట్టే తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్‌ విలన్‌గా నటిస్తున్నాడు. రోనిత్ రాయ్‌, శ్రద్దా శ్రీనాథ్‌, ప్రగ్యాజైశ్వాల్‌, చాందినీ చౌదరి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.

editor

Related Articles