విశ్వదేవ్ రాచకొండ, బిందుమాధవి ప్రధాన పాత్రధారులుగా ఓ సినిమా తెరకెక్కుతోంది. స్పిరిట్ మీడియా, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి శశాంక్ శ్రీవాస్తవయ దర్శకుడు. రానా దగ్గుబాటి సమర్పణలో రూపొందుతోన్న ఈ సినిమా ఫస్ట్లుక్ను శుక్రవారం మేకర్స్ విడుదల చేశారు. విశ్వదేవ్ రాచకొండ, బిందుమాధవి ఈ లుక్లో అల్ట్రా మోడరన్గా కనబడుతున్నారు. పోస్టర్పై ‘జానర్ అడగొద్దు.. మాక్కూడా తెలీదు’ అనే క్యాప్షన్ కథపై ఆసక్తిని పెంచుతోంది. వైవిధ్యమైన కథ, కథనాలతో ఈ సినిమా రూపొందుతోందని మేకర్స్ తెలిపారు. త్వరలో విడుదలకు సిద్ధమౌతున్న ఈ సినిమాకు సంగీతం: వివేక్ సాగర్.

- January 4, 2025
0
29
Less than a minute
Tags:
You can share this post!
editor