హీరోయిన్ తమన్నా మెయిన్ లీడ్ రోల్లో దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్లో రచ్చ సినిమా తర్వాత చేస్తున్న లేటెస్ట్ సినిమానే “ఓదెల 2”. అశోక్ తేజ దర్శకత్వంలో సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కించిన ఈ డివోషనల్ సినిమా నుండి నిర్మాతలు నేడు మహాకుంభమేళాలో సాలిడ్ టీజర్ కట్ని 102 ఏళ్ల నాగ సాదు చేతులు మీదుగా రిలీజ్కి సిద్ధం చేశారు. ఈ టీజర్ మాత్రం ఇంట్రెస్టింగ్ కట్తో తీసుకొచ్చారని చెప్పాలి. ఒక పక్క థ్రిల్ చేసే హర్రర్ ఎలిమెంట్స్ ఇంకో పక్క వాటిని ఎదుర్కొనే దైవ ఎలిమెంట్స్ని కూడా పర్ఫెక్ట్గా మిక్స్ చేసి ఈ టీజర్లో చూపించడం ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పవచ్చు. ఇలా మొత్తానికి మాత్రం ఓదెల 2 టీజర్ ఇంప్రెస్ చేసింది. ఇక ఈ సినిమాని నిర్మాతలు పాన్ ఇండియా ఇతర భాషల్లోకి త్వరలోనే రిలీజ్కి సిద్ధం చేస్తున్నారు.

- February 22, 2025
0
21
Less than a minute
Tags:
You can share this post!
editor