వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషించిన చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. అనన్య నాగళ్ల, సియా గౌతమ్ కీలక పాత్రధారులు. రైటర్ మోహన్ దర్శకుడు. వెన్నపూస రమణారెడ్డి నిర్మాత. వంశీ నందిపాటి చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ నెల 25న సినిమా విడుదల కానుంది. గురువారం హైదరాబాద్లో ఈ సినిమా ట్రైలర్ సక్సెస్ మీట్ని నిర్వహించారు. ట్రైలర్ మూడు మిలియన్ల వ్యూస్ని క్రాస్ చేయడం బిగ్ ఎచీవ్మెంట్ అని, కథను నమ్మి చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ ఇదని, కథనం అద్భుతంగా ఉంటుందని, సినిమా పూర్తవ్వగానే పార్ట్ 2 ఎప్పుడని అడుగుతారని వంశీ నందిపాటి చెప్పారు. ‘ఉత్తరాంధ్ర నేపథ్యంతో కూడిన కథ కావడంతో వెన్నెల కిషోర్తోపాటు ఆర్టిస్టులంతా ఆ యాసను ప్రాక్టీస్ చేసి నటించారు. రాజీవ్గాంధీ హత్య జరిగిన రోజు జరిగే కథ ఇది. ఆయన విశాఖ పర్యటన ముగించుకుని శ్రీపెరంబదూర్ వెళ్లారు. అక్కడ హత్యకు గురయ్యారు. అలాంటి పెద్ద సంఘటన జరిగినప్పుడు చిన్న సంఘటనల్ని ఎవరూ పట్టించుకోరు. ఆ రోజు జరిగిన కొన్ని కల్పిత ఘటనల చుట్టూ అల్లుకున్న కథ ఇది. సినిమా అన్ప్రిడిక్టబుల్గా ఉంటుంది.’ అని దర్శకుడు రైటర్ మోహన్ పేర్కొన్నారు.

- December 20, 2024
0
37
Less than a minute
Tags:
You can share this post!
editor