రాంగోపాల్‌ వర్మకు మూడు నెలల జైలు శిక్ష..!

రాంగోపాల్‌ వర్మకు మూడు నెలల జైలు శిక్ష..!

ఆరేళ్ల కిందటి కేసులో ముంబైలోని అంథేరీ మెజిస్ట్రేట్‌ కోర్టు  సంచలన తీర్పు వెలువరించింది. వివాదాస్పద డైరెక్టర్‌గా పేరుగాంచిన రాంగోపాల్‌ వర్మకు బిగ్‌ షాక్‌ తగిలింది. ఈ కేసులో ఆయన్ని దోషిగా తేలుస్తూ.. మూడు నెలల జైలు శిక్ష విధించింది. 2018లో రాంగోపాల్‌ వర్మపై చెక్‌బౌన్స్‌ కేసు  నమోదైంది. మహేష్‌చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుండి ఈ కేసు విచారణ జరుగుతుండగా.. వర్మ ఒక్కసారి కూడా కోర్టుకు హాజరుకావడం లేదు. కోర్టును ధిక్కరించినట్లైంది, న్యాయస్థానాన్ని అగౌరవపరిచినట్లైంది, దీంతో ఆగ్రహించిన కోర్టు వర్మపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. రాబోయే మూడు నెలల్లో ఫిర్యాదు దారుడికి రూ.3.72 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. లేదంటే మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని మెజిస్ట్రేట్‌ కోర్టు తీర్పులో పేర్కొంది.

editor

Related Articles