హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉంది. ‘ది స్కై ఈజ్ పింక్’ (2019) తర్వాత ఆమె మరే హిందీ సినిమాలో నటించలేదు. ప్రియాంకచోప్రా ఇక పూర్తిగా బాలీవుడ్కు దూరం కానుందనే వార్తలు కూడా వినిపించాయి. ‘వచ్చే ఏడాది తప్పకుండా బాలీవుడ్ సినిమా చేయబోతున్నా. ఖాళీ సమయాల్లో ముంబయికి విచ్చేసి ఇక్కడి దర్శకుల స్క్రిప్ట్స్ వింటున్నా. మంచి కథతో హిందీ ప్రేక్షకుల్ని పలకరిస్తా’ అని ప్రియాంకచోప్రా పేర్కొంది. ఇదిలా వుండగా ప్రియాంకచోప్రా, అలియాభట్, కత్రినాకైఫ్ ప్రధాన పాత్రల్లో ఫరాన్అక్తర్ దర్శకత్వంలో ‘జీలే జరా..’ చిత్రం మూడేళ్ల క్రితం మొదలై మధ్యలో ఆగిపోయింది. ప్రియాంక చోప్రా హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల డేట్స్ ఇష్యూస్తో ఆ సినిమా ఆగిపోయిందని బాలీవుడ్లో ప్రచారం జరిగింది. ఈ వార్తలపై ప్రియాంకచోప్రా స్పందిస్తూ ‘వాటిలో ఏమాత్రం నిజం లేదు. ఆ సినిమా ఎందుకు ఆగిపోయిందో మీరు నిర్మాణ సంస్థను అడిగితే బాగుంటుంది’ అని సమాధానమిచ్చింది.

- December 5, 2024
0
39
Less than a minute
Tags:
You can share this post!
editor