డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అరెస్ట్కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్లో పోస్ట్ చేసిన కేసులో రాంగోపాల్ వర్మ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్లో కేసు నమోదైంది. అయితే ఈ కేసులో పోలీసుల విచారణకు వర్మ డుమ్మా కొడుతూ వస్తున్నారు. ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విచారణకు సహకరిస్తానని, వారం రోజులు గడువు ఇవ్వాలని పోలీసులను కోరాడు. దీంతో పోలీసులు వర్మకు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 25న (ఇవాళ) విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, ఈసారి కూడా హాజరు కాకపోవడంతో పోలీసులు నేరుగా వర్మ ఇంటికి వెళ్లారు.

- November 25, 2024
0
27
Less than a minute
You can share this post!
editor