నటుడు మీజాన్ జాఫ్రీ ఒక ఇంగ్లీష్ పత్రికతో సంజయ్ గుప్తా డైరెక్షన్లో తీసిన తన రాబోయే సినిమా మిరాండా బ్రదర్స్ గురించి మాట్లాడారు. అతను తన భవిష్యత్ ప్రాజెక్ట్లు, ఆకాంక్షల గురించి కూడా తెలిపాడు. మీజాన్ జాఫ్రీ హర్షవర్ధన్ రాణేతో మిరాండా బ్రదర్స్ సినిమాలో నటించారు. సంజయ్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రం కోవిడ్ సమయంలో గోవాలో చిత్రీకరించబడింది. మిరాండా బ్రదర్స్ అక్టోబర్ 25న JioCinemaలో విడుదల చేస్తారు.
నటుడు మీజాన్ జాఫ్రీ తన సినిమా రాబోయే OTT ప్లాట్ఫాంలో విడుదల గురించి, మిరాండా బ్రదర్స్, హర్షవర్ధన్ రాణేతో కలిసి రెడీ అయ్యారు. యాక్షన్ మాస్టర్ సంజయ్ గుప్తా డైరెక్ట్ చేసిన ఈ సినిమా భౌతిక తీవ్రత నుండి విముక్తి, లోతైన వ్యక్తిగత కథతో మిళితం కాబడింది.
ఒక ఇంగ్లీష్ పత్రికతో ప్రత్యేక సంభాషణలో, జావేద్ జాఫ్రీ కుమారుడు, మీజాన్ జాఫ్రీ, సంజయ్ గుప్తాతో ఫస్ట్ టైమ్ కలిసి పనిచేయడం గురించి మాట్లాడారు, గుప్తా సమిష్టి ప్రాజెక్ట్లో భాగం కావడానికి మొదట సంకోచించాడని షేర్ చేశారు. ఆయన మాట్లాడుతూ సంజయ్ సర్తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. కోవిడ్ సమయంలో గోవాలో ఈ చిత్రాన్ని చిత్రీకరించామని చాలామందికి తెలియదు. అప్పుడప్పుడు చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి, కానీ సంజయ్ సర్ ఉన్నందున మేము వీటన్నింటినీ సులభంగా అధికమించి, ఆ పెయిన్ తెలియకుండా పనిచేసేలా చూసుకున్నారు. అతను చాలా మంచి డైరెక్టర్ అందుకే ఆయన పీస్ఫుల్గా ఎప్పుడూ ఉంటారు.