కిరణ్ రావు డైరెక్షన్లో అమీర్ఖాన్ నిర్మించిన ‘లాపతా లేడీస్’ చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని మూటగట్టుకుంది. మహిళా సాధికారత, స్వేచ్ఛ ప్రధానాంశాలుగా ఉత్తర భారత గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకొంది. 2025 ఆస్కార్ బరిలో భారత్ తరపున అధికారిక సినిమాగా ఎంపికైన విషయం తెలిసిందే. ఉత్తమ విదేశీ సినిమా కేటగిరీలో ఆస్కార్ను దక్కించుకునేందుకు అమీర్ఖాన్, కిరణ్రావు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఈ సినిమాని ప్రదర్శిస్తున్నారు. ఆస్కార్ ప్రచారం కోసం ఈ సినిమా టైటిల్ను ‘లాస్ట్ లేడీస్’గా మార్చుతున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అంతర్జాతీయ స్థాయిలో టైటిల్కు రీచ్ అయ్యేలా ఈ నిర్ణయం తీసుకున్నామని, హిందీ అర్థాన్ని స్ఫురించేలా ఇంగ్లీష్లో ‘లాస్ట్ లేడీస్’ అనే టైటిల్ పెట్టామని అమీర్ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ను విడుదల చేశారు.

- November 14, 2024
0
28
Less than a minute
Tags:
You can share this post!
administrator