బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. బాలీవుడ్ క్యూట్ కపుల్స్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తమ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త ఫొటోను షేర్ చేశారు. 2023 ఫిబ్రవరిలో ఆమె ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాను ఘనంగా పెళ్లి చేసుకుంది కియారా. జైపూర్లోని ఓ ప్యాలెస్లో అంగరంగ వైభవంగా వీళ్ల పెళ్లి జరిగింది. అయితే పెళ్లి అయిన నాలుగు నెలలకే కియారా అద్వానీ గర్భవతి అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఆ వార్తలు నిజమే అనుకున్నారు కియరా అభిమానులు. అయితే ఆ వార్తలు అబద్దమంటూ తర్వాత క్లారిటీ ఇచ్చింది ఈ హీరోయిన్. ఇదిలావుంటే తాజాగా నేను తల్లిని కాబోతున్నానంటూ ఒక ఫొటోను షేర్ చేసింది. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తమ రెండు చేతులు ముందుకు చాచి చిన్నారి సాక్స్ ఫొటో షేర్ చేశారు. మా జీవితాల్లోకి గొప్ప బహుమతి త్వరలో రాబోతోంది అంటూ ఈ ఫొటోకి క్యాప్షన్ పెట్టారు. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు, సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

- February 28, 2025
0
20
Less than a minute
Tags:
You can share this post!
editor