30 ఏళ్ల త‌ర్వాత రిలీజ్ ఔతున్న సినిమా ‘క‌ర‌ణ్ అర్జున్’

30 ఏళ్ల త‌ర్వాత రిలీజ్ ఔతున్న సినిమా ‘క‌ర‌ణ్ అర్జున్’

బాలీవుడ్ నుండి వ‌చ్చిన ఆల్‌టైం క్లాసిక్ సినిమాల‌లో క‌ర‌ణ్ అర్జున్ ఒక‌టి. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, స‌ల్మాన్ ఖాన్  ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకు హృతిక్ రోష‌న్  తండ్రి రాకేష్ రోషన్  దర్శకత్వం వహించాడు. ఇక ఇదే సినిమాకు హృతిక్ రోష‌న్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశాడు. 1995లో జ‌న‌వ‌రి 13న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యం అందించ‌డ‌మే కాకుండా రూ.6 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద రూ. 50 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఔట్ అండ్ ఔట్‌ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ సల్మాన్ ఖాన్‌, షారుక్ ఖాన్‌ సోదరులుగా నటించడంతో థియేట‌ర్ల‌కు క్యూ క‌ట్టారు ప్రేక్ష‌కులు. ఈ సినిమాను 30 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ రీ రిలీజ్ చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం తాజాగా ప్ర‌క‌టించింది. న‌వంబ‌ర్ 22న ఈ సినిమాను 4కే వెర్ష‌న్‌లో మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు చిత్ర‌బృందం వెల్ల‌డించింది.

administrator

Related Articles