ఆంధ్రాకు వెళ్తే సినిమా.. మన దగ్గరైతే మందు, మటన్‌: దిల్‌రాజు

ఆంధ్రాకు వెళ్తే సినిమా.. మన దగ్గరైతే మందు, మటన్‌: దిల్‌రాజు

టాలీవుడ్ యాక్టర్ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం. దిల్ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో దిల్‌రాజు చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ఫిమేల్ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను లాంచ్‌ చేయగా మంచి స్పందన వస్తోంది. ఈవెంట్‌లో దిల్‌రాజు చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో సినీ జనాలు సినిమాలను ఏ స్థాయిలో ఆదరిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రత్యేకించి తెలంగాణలో భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా టాలెంట్‌ ఉన్న ప్రతీ నటీనటులు, టెక్నీషియన్లను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. ఆంధ్రాకు వెళ్తే సినిమాకు ఒక వైబ్‌ ఇస్తరు. మన దగ్గర అయితే తెల్ల కల్లు, మందు, మటన్‌కు వైబ్ ఇస్తమని (నవ్వుతూ)’ అన్నారు. ఇప్పుడీ కామెంట్స్‌ నెట్టింట హాట్‌ టాపిక్‌గా అయ్యి కూర్చున్నాయి.

editor

Related Articles