‘కాంతారా’ ఫేమ్ రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ బయోపిక్ చిత్రం ఫస్ట్ లుక్ను ఇటీవలె విడుదల చేశారు.
ఈ సినిమా గురించి ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ, ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ బయోపిక్లో అవకాశం దక్కడం చాలా గౌరవంగా ఉందని, పాత్రకు ప్రాణం పెట్టి నటిస్తానని, ఈ ప్రాజేక్ట్ గురించి చెప్పగానే వెంటనే ఓకే చేప్పాను అన్నారు. నేటితరానికి ఇప్పటి వరకు శివాజీ మహారాజ్ గురించి తెలియని కథలను తెలియజేయాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం అన్నారు.
‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ చిత్రాన్ని హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో సందీప్ సింగ్ తీయనున్నారు. దర్శకుడు ఈ సినిమా గూర్చి మాట్లాడుతూ “ఇది కేవలం సినిమానే కాదు, మొఘల్ సామ్రాజ్యాన్ని సవాలు చేసి వ్యతిరేకంగా పోరాడిన ఓ యోధుడి కథ” అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 2027 సంవత్సరంలో జనవరి 21న రిలీజ్ కానుంది. ప్రస్తుతం ‘జై హనుమాన్’, ‘కాంతారా’ ప్రీక్వెల్తో బిజీగా ఉన్నారు రిషబ్ శెట్టి.