ఇప్పటికే బోర్డర్ 2 సినిమాలో నటిస్తున్న ఈ హీరో తెలుగు డైరెక్టర్తో ఒక సినిమా చేస్తున్నాడు. జాట్ అంటూ వస్తున్న ఈ సినిమాకి క్రాక్, వీరసింహారెడ్డి చిత్రాల డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు.. ఇప్పటికే సినిమా నుండి ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్రబృందం తాజాగా టీజర్ను రిలీజ్ చేసింది. టీజర్ చూస్తే.. సన్నీడియోల్ పవర్ ఫుల్ రోల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. రణ్దీప్ హుడా ఈ సినిమాలో విలన్గా నటిస్తుండగా.. ఈ సినిమాకి టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబి సినిమాటోగ్రాఫర్ కాగా.. అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్గా పనిచేస్తున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రంతో గోపీచంద్ మలినేని బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుండటంతో ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

- December 6, 2024
0
43
Less than a minute
Tags:
You can share this post!
editor