నేడు గేమ్‌ ఛేంజర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రాజమండ్రిలో..

నేడు గేమ్‌ ఛేంజర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రాజమండ్రిలో..

శనివారం సాయంత్రం రాజమండ్రిలో గేమ్‌ ఛేంజర్‌ ప్రీ రిలీజ్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌కు గేమ్‌ ఛేంజర్‌ హీరో రాం చరణ్‌, బాబాయి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ముఖ్య అతిథిగా వస్తుండడంతో జిల్లా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ సంధ్యా థియేటర్‌లో పుష్ప-2 బెనిఫిట్‌ షోలో చోటుచేసుకున్న ఘటనను పరిగణనలోకి తీసుకున్న ఏపీ పోలీసులు గేమ్‌ ఛేంజర్‌ సినిమాకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈవెంట్‌ కోసం భారీ ఏర్పాట్లు చేయగా, దాదాపు లక్ష మంది అభిమానులు రానున్నారనే అంచనా.. ఈవెంట్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా 400 మంది పోలీసు అధికారులు, 1,200 మంది పోలీస్‌ సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేశారు. పవన్‌ కళ్యాణ్‌ డిప్యూటీ సీఎం అయిన తరువాత ఈవెంట్‌కు వస్తున్న తొలి సినిమా గేమ్‌ ఛేంజర్‌ కావడం, తన అన్న చిరంజీవి కుమారుడు రాం చరణ్‌ సినిమాలో హీరోగా నటించడం విశేషంగా మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక వేదిక వద్దకు ఎవరూ రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు పోలీసులు.

editor

Related Articles