బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ క్రిష్ ఫ్రాంచైజీలో భాగంగా నాలుగో పార్ట్కు హృతిక్ రోషన్ దర్శకత్వం వహించబోతున్నాడు. 20 ఏళ్ల క్రితం ‘కోయీ మిల్ గయా’తో మొదలైన ఈ సిరీస్, ఆ తర్వాత ‘క్రిష్ 2’, ‘క్రిష్ 3’లతో బ్లాక్ బస్టర్లు అందుకుంది. ఈ సినిమాల్లో హృతిక్తో పాటు ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించగా, కంగనా రనౌత్, వివేక్ ఒబెరాయ్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించారు. అయితే తాజాగా రాబోతున్న ‘క్రిష్ 4’లో ప్రియాంక చోప్రా మరోసారి లీడ్ రోల్లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. హృతిక్ రోషన్ ఈ సినిమా కథను ప్రియాంకకు వినిపించగా.. ఆమెకు ఇంట్రెస్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై ప్రియాంక చోప్రా టీమ్ నుండి ఇప్పటివరకూ అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలావుంటే ఈ సినిమా కోసం ప్రియాంక చోప్రా భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. క్రిష్ 4కి ఏకంగా రూ.20 నుండి 30 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

- April 15, 2025
0
23
Less than a minute
Tags:
You can share this post!
editor