‘క్రిష్ 4’కు అత్యధిక పారితోషికంకై డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ

‘క్రిష్ 4’కు అత్యధిక పారితోషికంకై డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ

బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్ హీరోగా వచ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ క్రిష్ ఫ్రాంచైజీలో భాగంగా నాలుగో పార్ట్‌కు హృతిక్ రోష‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. 20 ఏళ్ల క్రితం ‘కోయీ మిల్ గయా’తో మొదలైన ఈ సిరీస్, ఆ తర్వాత ‘క్రిష్ 2’, ‘క్రిష్ 3’ల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్‌లు అందుకుంది. ఈ సినిమాల్లో హృతిక్‌తో పాటు ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించగా, కంగనా రనౌత్, వివేక్ ఒబెరాయ్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించారు. అయితే తాజాగా రాబోతున్న ‘క్రిష్ 4’లో ప్రియాంక చోప్రా మరోసారి లీడ్ రోల్‌లో కనిపించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. హృతిక్ రోష‌న్ ఈ సినిమా క‌థ‌ను ప్రియాంక‌కు వినిపించ‌గా.. ఆమెకు ఇంట్రెస్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై ప్రియాంక చోప్రా టీమ్ నుండి ఇప్పటివరకూ అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలావుంటే ఈ సినిమా కోసం ప్రియాంక చోప్రా భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. క్రిష్ 4కి ఏకంగా రూ.20 నుండి 30 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

editor

Related Articles